మైనార్టీల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం
17-03-2026 01:17 AM
- అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతాం
- తెలంగాణ భవన్లో ఇఫ్తార్ కార్యక్రమంలో కేటీఆర్
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు.
సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడా రు. శాసనసభ సమావేశాల్లో, మై నారిటీ వర్గాలను కాంగ్రెస్ ఏ విధంగా వం ంచిందో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతామన్నా రు. మైనార్టీ నేతలు తదితరులున్నారు.




