calender_icon.png 15 June, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమానికి మారుపేరు కాంగ్రెస్ ప్రభుత్వం

14-06-2025 04:26:24 PM

మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): సంక్షేమానికి మారుపేరు కాంగ్రెస్ ప్రభుత్వం అని, అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి(Market Chairman Ganta Sanjeeva Reddy) అన్నారు. కేసముద్రం మండలం కల్వల గ్రామంలో 34 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజీవ రెడ్డి మాట్లాడుతూ... సొంత ఇల్లు అనేది ప్రతి మనిషి కల అని, ఆ కలను సహకారం చేయడమే ఇందిరమ్మ హౌసింగ్ పథకం లక్ష్యం అన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి నిలువ నీడ కల్పిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండి శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెరుమాండ్ల ఎల్లా గౌడ్, గంట బాలకృష్ణ రెడ్డి, పొడేటి దినేష్, చింతనూరి చిన్న వెంకన్న, గంగరాజు, యోగేందర్, బొడ్డు బిక్షం, ఆరీపెల్లి యాకయ్య,లచ్చయ, శేఖర్ రెడ్డి, చంద్రం, సామల చందు, నరేందర్, ఓరుగంటి శ్రీను, నలమాస వీరాభద్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.