14-06-2025 04:29:09 PM
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్ధిల్ల శ్రీను బాబు(PCC State General Secretary Duddilla Srinu Babu) హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనుబాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు నిరంతరం కష్టపడతానని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి అధిష్టానం గుర్తించి గౌరవం ఇస్తుందని శ్రీను బాబు అన్నారు.