calender_icon.png 5 June, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

02-06-2025 02:34:38 AM

బీజేపీ నాయకులు డి.నారాయణ, పురుషోత్తంరెడ్డి, మున్నూరు రవీందర్

వనపర్తి, జూన్ 1 (విజయక్రాంతి):  ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయ కుండా మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని బిజెపి నాయకులు డి.నారాయణ,పురుషోత్తం రెడ్డి, మున్నూరు రవీందర్ లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రవే ట్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో వారు మాట్లాడారు.   

కొనుగోలు కేంద్రా ల్లో 20 రోజులుగా  కుప్పలుగా పే రుకుపోయినా తూకం వేయకుండా నానా ఇబ్బందు లు పెడుతున్నారన్నారు. శ్రీరంగాపూర్ మండల కేంద్రం కొనుగోలు కేంద్రంలో  20 వేలకు పైగా పేరుకుపోయిన ధాన్యం సంచులను వెంటనే తూకం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవె న్యూ) వెంకటేశ్వర్లు గారిని ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేస్తే అడిషనల్ కలెక్టర్  స్వయంగా కొనుగోలు కేంద్రం సందర్శించి రెండు మూడు రోజు ల్లో పూర్తిగా ధాన్యాన్ని కాంటా చేసి  రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందన్నారు .

  సీఎంఆర్  ప్రక్రియలో పదేళ్లు టీఆర్‌ఎస్,  18 నెలలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాణానికి బొమ్మ బొరుసుగా వ్యవహరి స్తూ రైస్ మిల్లలతో కుమ్మకై భారీగా అవినీతికి తెరలేపారన్నారు. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికలు నిర్వ హించే ధైర్యం లేదని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వచ్చిన దాన్యం ఉత్పత్తికి మూడు రె ట్లు ఉత్పత్తి అయిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం  ఉత్పత్తికి సరిపోను రైస్ మిల్లులు లారీలు హమాలీలు గన్నీ బ్యాగు లు సుత్తిలీల ఉంచడంలో పూర్తి గా విఫలం చెందారని  ప్రభుత్వానికి అధికారుల కు సమన్వయం కొరవడి రైతు అరిగోస పడుతున్నారన్నారు.

రాష్ట్రంలో వరి కొనుగోలు విషయం లో అసమర్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  14 రకాల చిరుధాన్యాలపై మద్దతు ధర పెంచి రైతులకు అండగా నిలిచారన్నారు.

ప్రధానమంత్రి న రేంద్ర మోడీ  జూన్ జూలై ఆగస్టు నె లలకు ఒకేసారి రేషన్ పంపిణీకి ఆదేశాలిచ్చారని సన్న బి య్యం పేరిట కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని  రేషన్ షాపులలో పూర్తిగా కేంద్ర ప్రభు త్వం తన నిధులతో ఉచితంగా పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో మరియు మం త్రుల ఫోటోలు వేసుకొని ఉద్దెర పోజులిస్తున్నారని వారుదు య్యబట్టారు.

ఈ సమావే శంలో జి ల్లా ప్రధాన కార్యదర్శి అక్కడ రామన్ గౌ డ్ ఉపాధ్యక్షుడు బండారు కుమారస్వామి జిల్లా అధికార ప్రతినిధి& మీడియా ఇన్చార్జి పెద్దిరాజు ఎస్సీ మో ర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఆగబోవు కుమార్ ఆగపోగు కుమార్ పాల్గొన్నారు.