02-06-2025 02:32:38 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జూన్ 1 (విజయ క్రాంతి) : ప్రజలకు మాయమాటలు చెప్పి అమలుకు సా ధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసేందుకు తజ్జనభజన పడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. గ్రేటర్ అట్లాంటా తెలంగా ణ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవం లో ఆదివారం ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రా వాలని కోరారు. కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఐటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చే శారని అన్నారు. తెలంగాణ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని పేర్కొన్నా రు. కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు అం దరూ కలిసి ఉండటం సంతోషకరమైన విషమని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ జనరల్ అఫ్ ఇండియా రమేష్ బాబు, పద్మశ్రీ అవార్డు గ్రహిత విటాల చార్య, సెనటర్ షాన్స్టిల్, జార్జీయ ప్రతినిధి జో న్స్, కార్టర్, ప్రొటెమ్ మేయర్ దిలీప్ తుంకి, కౌన్సి ల్ మెంబెర్ బోబ్ ఎర్రమిల్లి,జాన్స్ క్రీక్ సిటీ పో లీస్ చీఫ్ మార్క్ మిచెల్ తదితరులు పాల్గొన్నారు.