21-06-2025 12:45:30 AM
సిద్దిపేట, జూన్ 20 (విజయక్రాంతి):కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లు నరేష్, బత్తిని పెద్ద లింగం లు అన్నారు. శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతులమీదుగా సిద్ధిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన 61 మంది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామంలోని పేదలను విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 61 మందికి ఇల్లు నిర్మించుకొని సౌకర్యం కల్పిస్తూ నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి దశలవారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేకూరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాచమల్ల కనకయ్య, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.