21-06-2025 12:44:54 AM
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): వరంగల్ కాంగ్రెస్ పంచాది గాంధీభవన్కు చేరిందని, ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వరంగల్ కాంగ్రెస్ లో నేతల మధ్య నెలకొన్న వివాదంపై పరిశీలకులను నియమించామని, వారిచ్చిన నివేది కను బట్టి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పీసీసీ చీఫ్ స్పష్టంచేశారు.
నాయకులు ఎంతపెద్ద వారైనా పార్టీ నియమ నిబంధనల మేర కు నడుచుకోవావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీభవన్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. మంత్రులు తమ శాఖకు పరిమితమైతేనే మంచిదని, ఇష్టారీతిన మాట్లాడితే పార్టీకే నష్టమన్న విషయాన్ని గుర్తెరగా లని హితవు పలికారు. పార్టీ కార్య కర్తల్లో జోష్ నిం పడానికే స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం నుం చి స్పష్టత వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉ పఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు. అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తోంద న్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని అజారుద్దీన్ చెప్పడంలో తప్పేమీ లేదని, ఆ యన గతంలో ఈ నియోజకవర్గంనుంచి బరి లో నిలిచారని, మళ్లీ పోటీ చేస్తానని చెప్పి ఉం డొచ్చని పేర్కొన్నారు.
గతంలో సిట్టింగ్ ఎమ్మె ల్యే చనిపోతే.. వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ చేయకుండా ఉండే సంప్రదాయాన్ని వైఎస్ఆర్ కొనసాగించారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారని, కాబట్టి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అభ్యర్థిని బరిలో నిలుపుతోందని పేర్కొన్నారు.