calender_icon.png 28 November, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

28-11-2025 05:54:34 PM

హనుమకొండ,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ లోని పూలే దంపతుల విగ్రహలకు వరంగల్ ఉమ్మడి బీసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్ద కాలం క్రితమే మహాత్మా జ్యోతి రావ్ పూలే వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలు విద్య, ఉద్యగ, రాజకీయ రంగాలలో సమాన వాటా రావాలని కలలు కన్నారు, వారి ఆశయాలకు అనుకూలంగా జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు మేంమెంతో మాకు అంత  వాటా ఇవ్వాలని పోరాడుతున్న బీసీలకు,  ఈ అగ్రవర్ణలకు చెందిన పార్టీలు కనీసం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను కల్పించకుండ, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయకుండా గతంలో ఉన్న 23 శాతం బీసీ రిజర్వేషన్లను 17 శాతానికి  కుదించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్లను కల్పించకుండా సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తూ, రెడ్ల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పే విధంగా బీసీల పోరాటాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచాలని, డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలను 243 మంది ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులచే పార్లమెంట్ ను స్తంభింప చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓప్పించాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో ఆ రెండు పార్టీల ద్వంద వైఖరిని ఎండ కడతామని వేణుగోపాల్ గౌడ్ హెచ్చరించారు.