09-06-2025 12:45:56 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటేనే సంక్షేమానికి మారుపేరని, గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరుతో ప్రజలను పదేళ్లపాటు మభ్యపెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండ డంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఓర్చుకోలేకపోతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు.
శాయంపేట మండలంలో వివిధ గ్రామాల్లో లబ్దిదారులకు ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ చేసి, ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల ను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మొదటి విడతలో ఇళ్లు రానివారు ఎవరూ అధైర్య పడొద్దన్నారు.
కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్ తం డా, సాధనపల్లి, రాజుపల్లి, కాట్రపల్లి, నూర్జహాన్ పల్లి, ప్రగతిసింగారం, అప్పయ్యపల్లి, నేరేడుపల్లి, పత్తిపాక, హుస్సేన్పల్లి, కొత్తగట్టు సింగారం, సూరంపేట, నరసింహులపల్లి, మాందారిపేట, గోవిందా పూర్, పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారు.
గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనా ల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మ రించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం 22 వేల 500 కోట్ల రూపాయల ను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామన్నా రు.
ప్రజా ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు. బీఆర్ఎస్ గుండాయిజం మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.