09-06-2025 12:48:47 AM
సిద్దిపేట, జూన్ 8 (విజయక్రాంతి): సర్జికల్ సొసైటీ ఆఫ్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సర్జన్స్ అసోసియేషన్ జాతీయ సభ్యులు డాక్టర్ ఐలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా డాక్టర్ పి.భాస్కరరావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఏ. లింగం, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఏ.భాస్కర్, కోశాధికారిగా డాక్టర్ సంపత్, సహాయ కార్యదర్శులుగా డాక్టర్ శివరాములు, డాక్టర్ లవ్య కుమార్, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ శ్రావణ్, డాక్టర్ ఉమా మౌనిక, డాక్టర్ ప్రేమ్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ శ్యామ్ రావు, డాక్టర్ తేజస్విని, డాక్టర్ వెంకటరమణారెడ్డి, డాక్టర్ రజనీకాంత్ లు ఎన్నికైనట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి 15 వరకు సర్జన్ డే నిర్వహించాలని అందులో భాగంగా 12వ తేదీ ఉదయం వాల్కతాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపికైన కార్యవర్గం వెల్లడించారు.