09-06-2025 12:45:33 AM
9 న కలెక్టర్కుకృతజ్ఞతాసభ
సిరిసిల్ల, జూన్ 8 (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభు త్వం ఐకెపి కింద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధిక శాతం మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం 190 కేంద్రాలను ఎక్కువ మొత్తం లో జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా మహిళ సంఘా లకు కేటాయించారు.
అకాల వర్షాలు, వాతావరణ కారణాలతో రైతుల ధాన్యం ఉత్పత్తు లు పాడవకూడదని ఉద్దేశంతో ఏప్రిల్ మొదటి వారంలో 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంబించి 42,119 రైతుల నుండి 625 కోట్ల విలువైన 2.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు.
మహిళా సంఘాల ద్వారా 470 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
జిల్లాలో 190 వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా 470 కోట్ల విలువైన 2.2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని 32,556 రైతుల నుంచి సేకరించారు. వీటిలో మొత్తం 190 కేంద్రా లు సేకరణ అనంతరం మూసివేశారు. వీటిలో 32,087 మంది రైతుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయగా, 415 కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. మిగతా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు త్వరలో జమ కానున్నాయి.
మహిళా సంఘాలకు రూ. 6 కోట్ల కమిషన్
ఇందిరా మహిళా శక్తిలో భాగంగా దా న్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో భారీ సంఖ్యలో కేటాయించగా, కొనుగోలు సజావుగా పూర్తి చేశారు. ధాన్యం సేకరణ తుది దశకు చేరుకుంది. ఐకేపీ ఆధ్వర్యంలో మహి ళా సంఘాల సభ్యులు సేకరించిన ధాన్యం ఒక క్వింటాలుకు రూ.32 కమిషన్ గా ప్రభు త్వం నిర్ణయించింది.
ఈ లెక్కన జిల్లాలోని మహిళా సంఘాలకు దాదాపు 6 కోట్ల రూ పాయల కమిషన్ కింద దక్కనుంది. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ నెల 9 వ తేదీన(సోమవారం) జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు కృతజ్ఞతలు తెలుపుటకు సభ ను నిర్వహించనున్నారు.