బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని తిమ్మాజివాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రం రాజాశేఖర్, మల్లయ్య, భిక్షపతి, సంతోష్, స్వామి వారితో పాటు మరి కొంతమంది మంగళవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే తాము బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చేరిన నాయకులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కేవలం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తోనే అభివృద్ధి సాధ్యమని వారి నాయకత్వంలో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






