7 July, 2026 | 7:31 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

07-07-2026 06:47 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని తిమ్మాజివాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రం రాజాశేఖర్, మల్లయ్య, భిక్షపతి, సంతోష్, స్వామి వారితో పాటు మరి కొంతమంది మంగళవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్  వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే తాము బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చేరిన నాయకులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కేవలం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తోనే అభివృద్ధి సాధ్యమని వారి నాయకత్వంలో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.