16-09-2025 12:30:04 AM
నల్లగొండ టౌన్, సెప్టెంబర్15(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూలును ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పెద్ద గడియారం సెంటర్లో మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి లా సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అందులో భాగంగా సెప్టెంబర్ 25 న చలో సెక్రటేరియట్ జరుగుతుందని ఎన్ని నిర్బంధాలు ఎదురైనా హైదరాబాద్ కు వెళ్లాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 8 న రాష్ట్ర వ్యాప్త సమ్మె, జిల్లా కేంద్రాలలో 5 కిలోమీటర్లు పాదయా త్రలు చేయాలని,
17 నుండి ఫోన్లు అధికారులకు ఇచ్చేసి రిజిస్టర్స్ లో రాస్తూ ఆన్లైన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటి నిర్ణయించినదాని అంగన్వాడీలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొడిసెట్టి నాగమణి, కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి, భువనగిరి జిల్లా కార్యదర్శి రమ, ఉపాధ్యక్షులు మణెమ్మ వివిధ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.