calender_icon.png 9 June, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి కూడా వరండా కింద చదువులేనా?

09-06-2025 06:56:24 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలోని బ్రహ్మంగారి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం అర్థంతరంగా వదిలేయడంతో ఈ ఏడు కూడా వరండా కింద చదువు లేనా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం బడిబాట కార్యక్రమంలో పిల్లర్ల కే పరిమితమైన పాఠశాల భవనం వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

బ్రహ్మంగారి తండా పాఠశాలకు సరైన వసతి లేక అద్దె ఇండ్లలో, వరండా కింద ఏండ్ల తరబడిగా నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న  బ్రహ్మంగారి తండా పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయించి ఈ ఏడాది కొత్త భవనంలో విద్యాబోధన సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.