calender_icon.png 26 June, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధుల నియంత్రణలో నిరంతర కృషి చేయాలి

26-06-2025 12:44:43 AM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,జూన్25(విజయక్రాంతి): క్షయ వ్యాధి,వర్షాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో వైద్య ఆరోగ్యశాఖ నిరంతర కృషి చేయాలని, ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో క్షయవ్యాధి నిర్మూలన,కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి,వర్షాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో వైద్య ఆరోగ్యశాఖ నిరంతర కృషి చేయాలని,ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని,జిల్లాలో ప్రతి గ్రామంలో వనరబుల్ గ్రూప్స్ వ్యక్తులను గుర్తించి,వారంలో రెండు రోజులు క్యాంపు మోడ్ మొబిలైజేషన్ ద్వారా ఆర్బిఎస్కే వాహనాలు,108 వాహనాలలో తీసుకువచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏటూరునాగారంలో,ములుగుజిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రులలో వారికి ఎక్స్రేతో పాటు సిబినాట్ పరీక్షలను చేయించాలని,అప్పుడే ఎక్కువ మందికి టీబీ వ్యాధిని గుర్తించవచ్చునని తెలిపారు. క్షయ వ్యాధి వ్యాప్తి నిరోధించడం పట్ల అవగాహన కల్పించడంతోపాటు మంచి పోషకాహారాన్ని అందించాలని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు