09-06-2025 02:12:24 AM
24 గంటల్లో ఆరుగురు మృతి
1950 యాక్టివ్ కేసులతో కేరళ టాప్
న్యూఢిల్లీ, జూన్ 8: కరోనా కంగారు ఆగట్లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుకుంటూనే పోతుంది. జూన్ 8 ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133 కి చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో మహమ్మారి వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 378 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1950 కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు డేటాలో వివరించారు.
ఇప్పటి వరకు 65 మంది
కరోనా వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 65 మంది మృత్యువాత పడ్డట్టు కేంద్ర డేటా వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళలో అత్యధికంగా 1950 కేసులు నమోదవగా, గుజరాత్లో 822, పశ్చిమబెంగాల్ 693, ఢిల్లీ 686, మహారాష్ట్ర 595, కర్ణాటక 366, ఉత్తరప్రదేశ్ 219, తమిళనాడు 194, రాజస్థాన్ 132, హర్యానా 102 కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 86, తెలంగాణలో 10 కేసులు వెలుగుచూశాయి.