15 June, 2026 | 2:43 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

లోపాలు సరిచేస్తే చాలు

23-10-2024 12:00 AM

ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటర్ వ్యవస్థను బలోపేతం చేయాలి. వచ్చే విద్యా సంత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని అంటున్నారు. ఇంటర్ వ్యవస్థను రద్దు చేసి తొమ్మిది, పది, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఒకే దగ్గర ఏర్పాటు చేస్తామని పాలక వర్గం వారు ప్రకటించారు. దీనిపై రాష్ట్రవ్యాప్త చర్చలు విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృ తంగా జరుగుతున్నాయి.

ఇంటర్ వ్యవస్థ రద్దయితే పేద వర్గాల ప్రజలు చదివే కాలేజీలు మూత పడతాయి. ఇప్పటికే, చాలా పాఠశాలల్లో కనీస సంఖ్యలో కూడా స్ట్రెంత్ లేదు. వాటిని అప్‌గ్రేడ్ చేస్తే అవి నడువవు. అయితే, వ్యవస్థ లోపాలను సరిచేయ్యాలి. కానీ, వ్యవస్థను రద్దు చెయ్యడం సబబు కాదు. పేద పిల్లలకు మెరుగైన విద్య అందిస్తూ, మధ్యాహ్న భోజనం అందిస్తూ, ఇంటర్ స్థాయిలోనే జీవనోపాధి కల్పించే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి.

 ఉమాశేషారావు వైద్య, దోమకొం