06-06-2025 01:21:46 AM
నిర్మల్లో రెవెన్యూ అధికారులు, మేడ్చల్లో బిల్ కలెక్టర్లు
నిర్మల్ /మేడ్చల్, జూన్ 5 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ నలుగురు అ ధికారులు గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో షామీర్పేటకు చెందిన ఓ వ్యక్తి రెండు ఇల్లు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు బిల్ కలెక్టర్లు రాంరెడ్డి, శ్రవణ్ రూ.20 వేలు డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బాధితుడు గురువారం కార్యాలయంలో డబ్బులు ఇ స్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు.
నిర్మల్లో..
నిర్మల్ పట్టణంలోని ఓ కాలనీ చెందిన రిటైర్డ్ ఉద్యోగి తన ఇంటి అసెస్మెంట్ నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖా స్తు చేసుకున్నారు. పని పూర్తి కావాలంటే ఆ ర్ఐ సంతోష్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి సోయ బ్ అహ్మద్ రూ.6,000 లంచం డిమాండ్ చేశారు. ఒప్పందం కుదుర్చుకున్న బాధితు డు ఈ విషయాన్ని ఏసీబీకి చెప్పాడు.
వారి సూచనతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగికి రూ. 6,000 లంచం ఇస్తుండగా పట్టుకున్నట్టు ఏ సీబీ డీఎస్పీ విజయకుమార్ తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.