06-06-2025 01:20:22 AM
పటాన్ చెరు(సంగారెడ్డి), మే 5 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని కమిషనర్ సంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల ప్రణాళిక లో భాగంగా తెల్లాపూర్ లో కమిషనర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలని sప్లాస్టిక్ ను నిషేదించాలని నినాదాలు చేశారు మున్సిపల్ కార్యాలయం నుంచి గద్దర్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేడియల్ రోడ్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెన అధ్యక్షుడు రమణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.
హెటిరో పరిశ్రమలో మొక్కలు నాటిన సిబ్బంది
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో పరిశ్రమలో సిబ్బంది గురువారం మొక్కలు నాటారు. ప్లాంట్ హెడ్ మల్లికార్జున్ రెడ్డి, హెచ్ ఆర్ రవిబాబు సిబ్బందితో కలిసి పరిశ్రమలో మూడు వందలమొక్కలునాటారు.