14 April, 2026 | 5:06 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

అటవీ అధికారుల అవినీతి!

11-01-2026 12:05 AM

పాత గుంజలకు రూ.5 వేల డిమాండ్

ములుగు/వెంకటాపూర్, జనవరి 10 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో అటవీ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి వద్ద ఉన్న పాత గుంజలతో పందిరి వేయడానికే డబ్బులు ఇవ్వాలం టూ అధికారులు డిమాండ్ చేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్‌లో గునిగంటి రఘు.. మల్లన్న పట్నాల సందర్భంగా పందిరి వేసేందుకు సిద్ధమయ్యారు.

ఇంటి ముందు ఉన్న పాత గుంజలతో పందిరి ఏర్పాటు చేస్తుండగా, అటుగా వెళ్లిన అటవీ సెక్షన్, బీట్ అధికారులు గుంజల గురించి ప్రశ్నిస్తూ హం గామా చేశారు. గుంజలు పాతవేనని వివరించినప్పటికీ అధికారులు వినకుండా రూ. 5,000 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని హెచ్చరించారని ఆరోపించారు. ఈ ఘటనను చూసిన చుట్టుప క్కల వారు గుమిగూడగా,కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారు తుందని భావించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.