7 వేలు దాటిన కొవిడ్ కేసులు
- ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య
కేరళలో తగ్గని ఉధృతి
న్యూఢిల్లీ, జూన్ 11: చాపకిందనీరులా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 7121 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 10 నాటికి 6,815 కేసులు ఉండగా, 24 గంటల్లోనే 300కు పైగా కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కొవిడ్ ఉధృతి అధికంగా ఉంది. ఇక్కడ ఒక్కరోజులోనే కొత్తగా 170 కేసులు నమోయ్యాయి. మొత్తం 7 వేలకుపైగా కేసుల్లో 2,223 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవ్వడం విశేషం.
ఆ తర్వాత గుజరాత్లో 1,223 కేసులు, ఢిల్లీలో 757, పశ్చిమ్ బెంగాల్లో 747 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 615, కర్ణాటక 459, ఉత్తర్ప్రదేశ్ 228, తమిళనాడు 204, హర్యానా 125, రాజస్థాన్ 138, మధ్యప్రదేశ్ 65, ఛత్తీస్గఢ్ 48, బీహార్ 47, ఒడిశా 41, పంజాబ్, సిక్కి 33 చొప్పున, ఝార్ఖండ్, పండిచ్ఛేరిలలో 10 చొప్పున, జమ్మూకశ్మీర్ 9, అస్సాం, గోవాలో 6 చొప్పున, ఛండీగఢ్, ఉత్తరాఖండ్ మూడు చొప్పున, హిమాచల్ 2, మణిపూర్, త్రిపురలలో ఒక్కో కేసు నమోదైంది.
తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 72 కేసులు నమోదవగా, తెలంగాణలో 11 కేసులు నమోదయ్యాయి. జూన్ 10 నాటికి దేశవ్యాప్తంగా ఆరుగురు మృతిచెందారు. ఇందులో కేరళకు చెందిన వారే ముగ్గురు ఉన్నారు. మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతిచెందారు.






