22-06-2025 07:46:26 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమిని మండలంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ మూగ జీవిని బలి తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ తీగ తగిలి ఆవు మృతి చెందింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కోట నాగేష్ కి చెందిన ఆవుగా గుర్తించారు. మృతి చెందిన రూ. 35వేలు విలువ ఉంటుందని బాధితుడు నాగేష్ తెలిపాడు. విద్యుత్ అధికారులు అదుకొని నష్టపరిహారం ఇవ్వాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్థుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెను ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యమే ఆవును బలి తీసుకుందన్న ఆరోపణలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు మేలుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.