calender_icon.png 25 June, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు అండ.. ఎర్ర జెండా

24-06-2025 11:17:38 PM

సిపిఐ జిల్లా నాయకులు గూగులోత్ రామ్ చందర్..

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరసిల పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా నాయకులు గూగులోత్ రామ్ చందర్(CPI district leaders Guguloth Ramchander), అయిత శ్రీరాములు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు అండ ఎర్ర జెండానే అని అన్నారు. అర్హులైన నిరుపేదలకు రాజకీయ జోక్యం లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం టేకులపల్లి మండలంలోని నూతన గ్రామ శాఖ మహాసభలు నిర్వహించారు.

పెట్రాంచలక స్టేజి శాఖ కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా బాదావత్ రాందాస్, గూగులోత్ మంగ్యాను, బొమ్మనపల్లి శాఖ కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా డేగల రమేష్, కోరుకొప్పల వెంకటేశ్వర్లును, బిల్లుడు తండా శాఖ కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా భూక్య మోతి, బానోతు విజయను, చింతా లంక శాఖ కార్యదర్శి, సహాయ కార్యదర్శిగా జోగా కృష్ణవేణి, నాగేంద్రబాబును ఎన్నుకున్నామని తెలిపారు.