14-07-2025 02:01:25 AM
-ఇంటింటికీ సీపీఐ పేరుతో ప్రచారం నిర్వహించాలి
-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి
ముషీరాబాద్, జూలై 13(విజయక్రాంతి): సిపిఐ 4 వ మహాసభల విజయవంతానికి ఇంటింటికి సిపిఐ పేరుతో ప్రచారం నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యు లు చాలా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్లో సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల లోగోను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంక ట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ. నర్సింహా, కలవేణి శంకర్, శ్రామిక మహిళా ఫోరం జాతీయ నాయకురాలు ప్రేమ్ పావని, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎండీ. యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఈ. ఉమామహేష్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, లక్ష్మీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, డీహెచ్ పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనీల్ కుమార్, అధ్యక్షులు ఏసురత్నం ఏఐటీయూసీ సీనియర్ నేత రత్నాకర్ రావు, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వా రు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్బంగా సిపిఐ కార్యకర్తలు ఇంటిఇంటికి వెళ్లి పార్టీ లక్ష్యాలను వివరిస్తూ వారి వద్ద చం దాలను వసులు చేసి మహాసభలను జయప్రదం కోసం పని చెయ్యాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రచ్చ కిషన్, స్వామి, హరినాథ్, కృష్ణ, శ్రీనివాస్, సత్య ప్రసాద్, జిల్లా నాయకులు ప్రమీల, మహాలక్ష్మి, గిరిజ, యాదయ్య, బాబు, జంగయ్య, బాపూరాజు, అజీజ్, పరమేశ్వర్,ఐలయ్య, రమేష్, వెంకటేష్, మనోహర చారీ తదితరులు పాల్గొన్నారు.