19-06-2025 05:25:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): వ్యవసాయం తర్వాత ప్రధాన ఉపాధి కల్పిస్తున్న బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని పరిధిలో పెంచాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న(IFTU District Secretary Rajanna) అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించి పరిశ్రమ రక్షణ కోసం ఈనెల 21, 22 తేదీల్లో నిజాంబాద్ జిల్లాలో కార్మికుల మహాసభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాసభల పోస్టర్లను ఆవిష్కరించి ఈ సభలకు పెద్ద ఎత్తున మహిళా కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగన్న గఫూర్ లక్ష్మి గంగామణి తదితరులు పాల్గొన్నారు.