6 June, 2026 | 5:43 PM

Breaking News

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •   38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు   •   ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం   •   ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి   •  

సీపీఐ వందేళ్ల పండుగను జయప్రదం చేయాలి

12-11-2025 12:00 AM

మహబూబాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పండుగను ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. సీపీఐ, ఏఐటీయూసీ ఉమ్మడి పట్టణ సమావేశం స్థానిక వీరభవన్‌లో తోట రాజకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పండుగను ఖమ్మంలో డిసెంబర్ 26న 5 లక్షల మందితో నిర్వహించనున్నట్లు చెప్పారు.

శతాబ్ది బహిరంగ సభ జయప్రదానికై సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నవంబర్ 20న మహబూబాబాద్ జిల్లాకు బస్సుజాత వస్తుందని, ఆరోజు జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బి.అజయ్ సారధి రెడ్డి, పెరుగు కుమార్, దేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వీరవెల్లి రవి, తోట రాజకుమారి, కేదాసు రమేష్, అజ్మీర వేణు, వంకాయలపాటి చిరంజీవి, సీపీఐ, ఏఐటీయూసీ నేతలు కార్మికులు పాల్గొన్నారు.