calender_icon.png 23 June, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం సత్తాచాటాలి

23-06-2025 05:55:35 PM

కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగట్టాలి

భద్రాచలం అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి

పోలవరం ముంపు పై రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి కేంద్రంతో, ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు.

భద్రాచలం (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రాచలం పట్టణంలో సిపిఎం సత్తా చాటాలని పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు(District Secretary Maccha Venkateshwarlu) పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరిగే సిపిఎం భద్రాచలం పట్టణ రాజకీయ శిక్షణ తరగతులు కామ్రేడ్ చందర్రావు భవన్ నందు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి శిక్షణ తరగతులను ప్రారంభించారు. పార్టీ నిర్మాణం, పని పద్ధతులు అంశాన్ని కామ్రేడ్ మచ్చా వెంకటేశ్వర్లు బోధించగా పార్టీ కార్యక్రమం అఖిలభారత మహాసభల తీర్మానంను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ బోధించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందుతుందని విమర్శించారు.. భద్రాచలం అభివృద్ధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడాలని, పోలవరం సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రంతో, ఏ.పీ ప్రభుత్వంతో మాట్లాడాలని అన్నారు.

పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జే. రమేష్ మాట్లాడుతూ... రోజురోజుకి ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, నిరుద్యోగం, పేదరికం, అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని అన్నారు.

అసమానతలు లేని సోషలిస్టు వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. రెండు రోజులపాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్ గా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు డి సీతాలక్ష్మి పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, నకిరికంటి నాగరాజు, ఎస్ భూపేంద్ర, జీవనజ్యోతి, కుంజా శ్రీనివాస్ సిహెచ్ మాధవరావు, కొలగాని రమేష్, ఎస్ అజయ్ కుమార్, కనక శ్రీ, చాట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.