23-06-2025 05:50:55 PM
అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో సిపిఐ 20వ మహాసభ ఎస్ కే టి ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా అనంతనేని సురేష్, సహయ కార్యదర్శులుగా వేల్పుల మల్లికార్జున్, మేలాపురం సురేందర్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు 21మంది కార్యవర్గ సభ్యులను, 60 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు.