calender_icon.png 23 June, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురం సీపీఐ నూతన మండల కమిటీ ఎన్నిక

23-06-2025 05:50:55 PM

అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో సిపిఐ 20వ మహాసభ ఎస్ కే టి ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా అనంతనేని సురేష్, సహయ కార్యదర్శులుగా వేల్పుల మల్లికార్జున్, మేలాపురం సురేందర్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు 21మంది కార్యవర్గ సభ్యులను, 60 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు.