24 August, 2026 | 11:35 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

నకిలీ విక్రయాలపై ఉక్కుపాదం

08-07-2026 12:00 AM

సిద్దిపేట రూరల్, జులై 7: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, నకిలీ లేదా నాణ్యతలేని వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ హెచ్చరించారు.

సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విత్తనాలు, ఎరువులు, రసాయన మందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్లులు, నిల్వలు, గడువు తేదీలు పరిశీలించారు. రైతులు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అక్రమాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.