calender_icon.png 27 June, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి నిధులు జమ

17-06-2025 10:59:03 PM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..

సూర్యాపేట (విజయక్రాంతి): రైతుకు పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా నిధులు జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అయినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandalal Pawar) మంగళవారం విలేకరులకు తెలిపారు. వానాకాలం-2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద జిల్లాలో 2,85,344 మంది రైతులకు గాను మూడు ఎకరాల లోపు వరకు ఉన్న 2,17,698 మంది రైతులకు రూ.167.69 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయన్నారు. రైతుకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. అయితే ఇచ్చిన హామీ మేరకు వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందించడం పట్ల రైతుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.