21-07-2025 01:12:19 AM
- ప్రకటించిన కేంద్రం
- ప్రధాని మోదీకి ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు
మహబూబ్నగర్, జూలై 20 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కేంద్రం రూ.100 కోట్ల సాయం ప్రకటించింది. ఇందుకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలపై ఇటీవల కేంద్రం ప్రత్యేక సర్వే చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా 12 జిల్లాలకు, తెలంగాణలో 3 జిల్లాలను గర్తించిందని వెల్లడించారు.
రాష్ట్రంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న జిల్లాలుగా మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ ను గుర్తించి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాలకు కలిపి 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు జాతీయ విపత్తు నిర్వహణ కింద రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.
ఈ రూ.100 కోట్లతో ఈ మూడు జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తి, పర్యావరణ మద్దతు, రైతుల ఆదాయ భద్రతకు వినియోగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతులందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.