30-06-2025 02:40:09 AM
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): పీసీసీ క్రమశిక్షణ కమిటీ జిల్లాలు, నియోజకవర్గాల్లోని పార్టీ నేతల పంచాయితీలపై దృష్టి సారించింది. పార్టీ గీత దాటిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి రాష్ట్రంలోని వివి ధ జిల్లాలు, నియోజకవర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న పంచాయితీలు, ఫిర్యాదులపై దృష్టి సారించి, వారి ని గాంధీభవన్కు పిలిపించుకుని వివరణ తీసుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్ కాంగ్రెస్ నేతల పంచా యితీపై వచ్చిన ఫిర్యాదులపై నాయకులతో మాట్లాడుడుతున్నారు.
మంత్రి కొండా సురేఖ భర్త కొండా ముర ళి ఇటీవలనే ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. కొండా మురళి కూడా గాంధీభవన్కు వచ్చి జిల్లాకు చెందిన కొందరు నాయకులు, ఒక మంత్రిపైన పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఖైరతాబాద్, గద్వాల, పఠాన్చెరు, అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ తదితర నియోజకవర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న పంచాయితీలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎంపీ మల్లు రవి పార్టీ నాయకులతో చర్చించారు. పార్టీలో ప్రతి నాయకుడు క్రమశిక్షణతో ఉండాలని సూ చిస్తున్నారు.
రావి శ్రీనివాస్పై ఆరేళ్ల వేటు
మంత్రి సీతక్కపై సిర్పూర్ కాగజ్నగర్ పార్టీ నేత రావి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై పీసీసీ క్రమశిక్షణ సంఘం స్పందించింది. డీసీసీ అదిలాబాద్ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆరోపణలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. మల్లు రవి ఆ వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించారు. రావి శ్రీనివాస్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పార్టీలో గీత దాటి మాట్లాడితే వేటు తప్పదనే హెచ్చరిక చేశారని కాంగ్రెస్ వర్గలు చెపుతున్నాయి.