30-06-2025 02:41:45 AM
మంత్రి వివేక్ వెంకటస్వామి
ఖైరతాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి): నిరంతరం ప్రజా అభివృద్ధి కోసం కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నా రు. ఇటీవల కాలంలో మంత్రివర్గంలో చో టు దక్కినందుకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.. కాక వెంకటస్వామి ఆశయాలతో ఆయన ముందుకు సాగుతున్నట్లు తెలి పారు.
పేదరిక నిర్మూలన కోసం కాక వెంకటస్వామి చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి తమ కుటుంబం పార్టీకి అండగా ఉందని తెలిపారు. నీతి నిజాయితీతో పనిచేసే వారికి ప్రజలు ఎప్పుడూ పట్టం కడతారని తెలిపారు. భవిష్యత్తులో కాక వెంకటస్వామి ఆశయాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సిద్ధికి, సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.