24 February, 2026 | 8:36 PM

నూతన రథోత్సవానికి ఘన శ్రీకారం

24-02-2026 06:41 PM

- అంతంపేట సోమేశ్వరాలయ జాతరలో భక్తుల సందడి

మునుగోడు(గట్టుప్పల్),(విజయక్రాంతి): సోమరాజుగూడ అంతంపేట గ్రామంలోని సోమేశ్వరాలయ వార్షిక జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతరలో మూడవ రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం నూతనంగా తయారు చేసిన రథాన్ని ఇందుర్తి వాస్తవ్యులు కుంభం సత్యనారాయణ రెడ్డి ప్రారంభించి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, గట్టుప్పల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నామిని జగన్నాథం, ఎస్సై సంజీవరెడ్డి, శ్రీశైలం గౌడ్, రాచమల్ల వెంకటరెడ్డి, దేవస్థానం చైర్మన్ మాడుగుల నవీన్, పూసపాటి శంకరప్ప, ఓసి రెడ్డి రామిరెడ్డి, సిరప్ శేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని సందడి నెలకొంది.