22 June, 2026 | 2:34 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

యాదాద్రిలో భక్తుల రద్దీ

01-07-2024 01:27 AM

 స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం

యాదాద్రి భువనగిరి, జూన్ 30 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో సందర్శించారు. స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. దాదాపు 40 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించినట్టుగా అధికారుల అంచనా. ప్రధానాలయంలో స్వామివారికి నిత్య సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మండపంలో హోమం జరిపారు. లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.. 

లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రాలను అందజేసి వేదాశీర్వచనం జరిపారు. ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి సైతం స్వామివారిని దర్శించుకున్నారు.