22 June, 2026 | 3:34 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

22-06-2026 02:11 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

 ఉట్నూర్, జూన్ 22( విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఉపసర్పంచుల  సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల ఉపసర్పంచులు  సంఘంగా ఏర్పడి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల ఉపసర్పంచ్ లో  సంఘం ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సన్మానించి తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఉప సర్పంచుల సమస్యల పరిష్కారంతోపాటు  చెక్ పవర్ అందే విధంగా తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఉప సర్పంచుల సంఘం  మండల శాఖ అధ్యక్షుడు  వెడ్మ కొద్దు పటేల్ ల తో పాటు మండల ఉపసర్పంచులు పాల్గొన్నారు.