08-05-2025 08:41:34 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,001 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,637 మంది భక్తులు బుధవారం శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.25 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.