24 August, 2026 | 11:35 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ

24-08-2026 10:28 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి నులకు సైబర్ సెక్యూరిటీ పై సోమవారం  శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అనుదీప్ ఫౌండేషన్ నిర్వాహకులు రవి,  ప్లేసెమెంట్ మేనేజర్ సాయి వరుణ్, శిక్షణ నిర్వాహకురాలు  కావ్య  పాల్గొని విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించారు.  సైబర్ సెక్యూరిటీ ద్వారా  కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు, డిజిటల్ డేటాను హ్యాకర్లు, వైరస్‌ల నుండి రక్షించడం, సైబర్ సెక్యూరిటీ అనేది డిజిటల్ దాడుల నుండి సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లు, ప్రోగ్రామ్‌లను రక్షించే ప్రక్రియ అని,

  ఈ సైబర్ దాడులు సాధారణంగా సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడం, మార్చడం లేదా నాశనం చేయడం; రాన్సమ్‌వేర్ ద్వారా వినియోగదారుల నుండి డబ్బును బలవంతంగా వసూలు చేయడం లేదా సాధారణ వ్యాపార ప్రక్రియలకు అంతరాయం కలిగించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.