05-06-2025 08:14:58 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డిసిపి భాస్కర్(DCP Bhaskar) ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గురువారం స్టేషన్ లో పలు రికార్డులతో పాటు పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డిసిపి భాస్కర్ మాట్లాడుతూ... పిటిషన్లను పెండింగ్ లో పెట్టకూడదని, పని నిమిత్తం స్టేషన్ కు వచ్చిన సందర్శకులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. డిసిపి వెంట సిఐ రమణమూర్తి ఉన్నారు.