17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

తోకభాగంలో మృతదేహం

15-06-2025 12:37 AM

- ఎయిర్‌హోస్టెస్‌లో ఒకరిగా గుర్తింపు

- అహ్మదాబాద్‌లోని ప్రమాద ఘటనాస్థలం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

న్యూఢిల్లీ, జూన్ 14: ఈనెల 12న మధ్యా హ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానాశ్రయం సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు విమానం మొత్తం మంటల్లో కాలిపోగా, తోకభాగం మాత్రం భవనంపై చిక్కుకుపోయింది.

శనివారం ఉద యం వాటిని తొలగిస్తుండగా.. రెస్క్యూ సి బ్బంది ఓ మృతదేహాన్ని గుర్తించింది. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్‌హోస్టెస్‌లో ఒకరిదిగా అధికారులు గుర్తిం చారు. విమానం కుప్పకూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అ టు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనేందుకు దర్యాప్తు అధికారులు కూడా ఘ టనా స్థలాన్ని పరిశీలించారు.