15-06-2025 12:39:31 AM
-వచ్చే ఏడాది జూన్ 14 వరకు అవకాశం
న్యూఢిల్లీ, జూన్ 14: ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు శనివారంతో ము గియనుండగా, తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
2026, జూన్ 14 వరకు అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆధార్ను అప్డేట్గా ఉంచేందుకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్కు మరోసారి అవకాశం కల్పిస్తున్నామని, దీనివల్ల దేశంలోని కోట్లాది మం దికి ప్రయోజనం కలుగుతుందని ఉడాయ్ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితం గా డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ డేటాబేస్లో ప్రస్తుత, కచ్చితమైన స మాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ఆధార్కార్డుదారులకు ఉడాయ్ ఈ అవకా శం కల్పిస్తోంది.
ఇందుకోసం గుర్తింపు రుజువు (పీవోఐ), చిరునామా రుజువు (పీవోఏ) పత్రాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చే సుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. వివాహం, ఉన్నత చదువులు, ఇతర కారణాల వ ల్ల కొందరు వేర్వేరు ప్రదేశాలకు మారుతుంటారు. అలాంటి వారికి ఇది ఉపయోగకరం గా ఉంటుంది. అలాగే, ఎవరైతే ఆధార్ తీసుకొని పదేళ్లు పూర్తయ్యి ఉంటుందో వారు కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలోనే సూచించింది. గతం లో ఆయా వివరాల అప్డేట్ ఆయా వివరాలు అప్డేట్ చేసేందుకు ఆధార్ కేంద్రాల్లో రూ.50 రుసుము చెల్లించాల్సి వచ్చేది.