24-06-2025 12:48:33 AM
తూప్రాన్, జూన్ 23 : భారతదేశం అభివృద్ధికి బీజం వేసిన మహానీయుల్లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ముందు వరుసలో నిలిచారని తూప్రాన్ మండల బిజెపి నేతలు అన్నారు. ఆయన జ్ఞాపకార్థంగా సోమవారం తూప్రాన్ మున్సిపల్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపి మున్సిపల్ నేతలు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిట్ల పోచయ్య, సీనియర్ నాయకులు తాటి విట్టల్, దుర్గారాజు యాదవ్, నరసింహారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు జానకి గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, టౌన్ జనరల్ సెక్రెటరీ పోతురాజు శరత్, భూత అధ్యక్షుడు మంగలి నవీన్, వెంకట్ రాకేష్, కుంట రాజు, నరేష్ పాల్గొన్నారు. అలాగే మనోహరాబాద్ మండలంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కమ్మరి నరేంద్ర చారి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటోళ్ల సాయికిరణ్ గౌడ్, నాయకులు పురం మహేష్, మాజీ సర్పంచ్ ఐలయ్య, టౌన్ ప్రెసిడెంట్ శ్రీశైలం, బూత్ కమిటీ అధ్యక్షులు సందా ప్రవీణ్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.