calender_icon.png 28 June, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12కు పెరిగిన మృతుల సంఖ్య

28-06-2025 01:03:25 AM

అలకనంద బస్సు ప్రమాదం

డెహ్రాడూన్, జూన్ 27: ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో ని అలకనంద నదిలో బస్సు పడ్డ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగినట్టు తెలుస్తోంది. గురువారం 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బ స్సు అదుపుతప్పి రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద నదిలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్ర మాదంలో 8 మంది మరణించగా.. గల్లంతయిన వారిలో 10 మంది ఉన్నారు.

తాజాగా శుక్రవారం మరో నలుగురు మృతి చెందినట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. కాగా ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడి ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. ఈ ప్రమాదం పై ఇప్పటికే విచారణ కమిటీ వే యగా.. గల్లంతైన వారి వివరాలు తె లిస్తే సబ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో తెలపాలని రుద్రప్రయాగ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.