06-06-2025 01:12:28 AM
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ (డీఈఈ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న ఆన్లైన్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. 73.18 శాతం విద్యార్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు.
మొత్తం 48,815 మంది దరఖాస్తు చేసుకోగా 33,321 మంది పరీక్షకు హా జరయ్యారు. వీరిలో 28,442 మంది (78. 18 శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు అధికారు లు పేర్కొన్నారు. తెలుగు మీడియంలో 72.79 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 86.34 శాతం, ఉర్దూ మీడియంలో 38.35 శాతం మంది అర్హత సాధించారు.
తెలుగు మీడియంలో 77 మార్కులతో తక్కళ్లపల్లి హరిత టాపర్గా నిలిచింది. ఇంగ్లీష్ మీడియంలో 87 మార్కులతో పసునూరి అభినవరెడ్డి, ఉర్దూ మీడియంలో 67 మార్కులతో ఫరాజ్ అహ్మద్ టాపర్గా నిలిచారు.
9 నుంచి కౌన్సిలింగ్..
డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ర్టంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అర్హత సాధించినవారు ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ర్టవ్యా ప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో దాదాపు 4వేల వరకు సీట్లు ఉన్నట్టు తెలుస్తోంది.