06-06-2025 12:37:17 AM
ఒకేరోజు ఉండటంపై అభ్యర్థుల్లో ఆందోళన
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ టెట్, ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలు ఒకేరోజు జరగనుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకేరోజు పరీక్ష లు ఎలా రాయగలమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ టెట్ జూన్ 18 నుంచి 30 వరకు, ఏపీ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్నాయి. అయితే ఇందులో జూన్ 18 నుంచి 30 వరకు రెండు రాష్ట్రాల్లో పరీక్షలు ఉన్నాయి.
కొందరు నాన్లోకల్ కోటాలో ఆంధ్ర డీఎస్సీకు దరఖాస్తు చేసిన తెలంగాణ అభ్యర్థులు ఇటు టెట్ అటు డీఎస్సీ పరీక్షలు ఒకే రోజు రాయలేని పరిస్థితి ఏర్పడింది. పరీక్షా కేంద్రాలను కూడా కొందరికి హైదరాబాద్, మరికొందరికి ఏపీలో కేటాయించారు. ఈ నెల 20వ తేదీన ఎక్కువ మందికి టెట్ పేపర్ పాటు ఏపీలో ఎస్జీటీ పరీక్ష ఉండడం వల్ల ఇబ్బంది ఏర్పడనుంది.