న్యూఢిల్లీ: భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి తిరిగి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు దక్కించుకుంది. తాజాగా షాంఘై ఆర్చరీ ప్రపంచకప్లో రజత పతకంతో మెరిసిన మాజీ ప్రపంచ నంబర్వన్ దీపికను టాప్స్లో చేర్చుతున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడిం చింది. మాతృత్వ మాధూర్యాన్ని అనుభవించిన తర్వాత తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టిన 29 ఏళ్ల దీపిక.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోంది. ఇప్పటి వరకు మూడుసార్లు విశ్వక్రీడల్లో పాల్గొన్న దీపిక ఈ సారి పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తోంది.