14 July, 2026 | 7:15 PM

Breaking News

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •  

ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక

14-07-2026 07:12 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి మండల  పి ఆర్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సంఘ నూతన అధ్యక్షులుగా ఇ.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ఎ. అనిల్ కుమార్ రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ ఎన్నిక జిల్లా అధ్యక్షులు వై. రామేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సిహెచ్. ఆనంద్ రెడ్డి సమక్షంలో జరిగింది. మండల అసోసియేట్ అధ్యక్షులుగా సామ భూపాల్ రెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎన్. మాధవి, ఉపాధ్యక్షులు గా బాలరాజ్, అరుణ, కార్యదర్శులుగా జబ్బార్ ,లావణ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు విజయలక్ష్మీ, భాగ్యలక్ష్మి, జ్యోతి, మార్టిన్, శ్రీరామ్ ప్రసాద్, ఆల్వాల్  అధ్యక్షులు నర్సింహా, ప్రధాన కార్యదర్శి కైలాసపతి తదితరులు పాల్గొన్నారు.