చెన్నై: టీ20 క్రికెట్ మొదటి నుంచి బ్యాటర్లకే అనుకూలమని.. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆ స్థాయిని మరో లెవెల్కు తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. చెన్నైతో మ్యాచ్ ఓటమి అనంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ‘ మ్యాచ్లో మేము అమలు చేయాలనుకున్న ప్లాన్ ఫలించలేదు. చేజింగ్ ద్వారా మ్యాచ్ గెలుద్దామనుకున్నాం.. కానీ నిరాశ ఎదురైంది. రాబోయే మ్యాచ్ల్లో తప్పులు సరిదిద్దుకుంటాం. ఈ సీజన్లో అన్ని జట్లు సులువుగా 200 ప్లస్ స్కోర్లు బాదేస్తున్నాయి. పిచ్లు బౌలింగ్ కంటే బ్యాటింగ్కే ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. అందుకే పరుగుల వరద పారుతోంది. సాధారణంగా టీ20 క్రికెట్ బ్యాటర్లకు అనువుగా ఉంటుంది. ఫ్లాట్ పిచ్లు రూపొందించడం ద్వారా ఐపీఎల్ దానిని మరో స్థాయికి తీసుకెళ్లింది’ అని కమిన్స్ తెలిపాడు.