24 August, 2026 | 11:42 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి

24-08-2026 10:39 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): రోడ్డుపై దొరికిన పర్సును బాధితునికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు దెగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న సర్పంచ్ కు పర్సు లభించింది. పర్సులోని వివరాల ప్రకారం ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన సింధుల సుమన్‌కు చెందినదిగా గుర్తించారు. పర్సులో సుమారు రూ అయిదు వేల నగదుతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి.

బాధితుని వివరాలు తెలుసుకొని సుమన్ కు సమాచారం అందించాడు. అనంతరం పర్సులో ఉన్న నగదు, డాక్యుమెంట్లతో సహా సుమన్‌కు సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా సుమన్ సర్పంచ్ లింగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. పోగొట్టుకున్న పర్సును తన సొంత సొత్తుగా భావించకుండా, గుర్తించి తిరిగి అప్పగించడం ద్వారా సర్పంచ్ లింగారెడ్డి నిజాయితీ, మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామస్థులు అభినందించారు.