స్వాతంత్య్ర వేడుకలకు ఢిల్లీ ముస్తాబు
15-08-2024 12:43 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత 78వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు దేశం ముస్తాబైంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాద దాడులు జరుగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు నగరాన్న తమ చేతుల్లోకి తీసుకొన్నాయి. అత్యంత కీలకమైన ప్రాంతాలుగా గుర్తించిన 700 చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా నిఘాను పెంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులు హాజరవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు.




